కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!!

కనవేమీరా రామా..! సీతమ్మ ఘోష…!!

భద్రాచలం : సిద్ధాంతాలను నమ్మి వచ్చి మావోయిస్టుల కదలికలను తెలంగాణ, చత్తీష్ఘడ్, ఆంధ్ర పోలీసులకు కోవర్టులుగా పనిచేస్తూ పార్టీకి ద్రోహం చేస్తున్న వారిపై మావోయిస్టులు డేగ కన్నుతో న్యూ మిషన్ స్టార్ట్ చేశారు. ఏఓబీ రక్షణ దళం కమాండర్ గా ఉన్న నిల్సో రాధ దళ సభ్యురాలుగా చేరి కమాండర్ స్థాయికి ఎదికాక పోలీసులకు కోవర్టుగా పనిచేస్తున్న విషయం గమనించిన మావోయిస్టులు ప్రజాకోర్టు నిర్వహించడంతో అంగీకరించిన మహిళ మావోయిస్టు రాధకు మరణ శిక్ష విధించినట్లు ఏవోబీ జోనల్ స్పెషల్ కమిటీ కార్యదర్శి గణేష్ లేఖ విడుదల చేశారు. పోలీసులకు కోవర్టులగా పని చేసే ఎవరికైనా ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు. చర్ల మండలం చెన్నాపురం గ్రామ సమీపంలో రాధ మృతదేహం లభ్యం కావడంతో చర్ల పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలం నుండి మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిత్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. ఇదిలా ఉండగా దళిత ఆడ బిడ్డను దారుణంగా హతమార్చిన మావోయిస్టుల దుశ్చర్యను ఖండిస్తూ దిశ కమిటీ మహిళా సభ్యులు నినాదాలు చేశారు.

Please follow and like us:
Pin Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *