భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలోని రాజాం నియోజకవర్గంలో వావిలవలస గ్రామంలో ఉన్న రాహుల్ సౌరబ్ నిత్య అన్నదాన సత్రంలో నిత్య అన్న ప్రసాదం కార్యక్రమం నిర్వహిస్తూ నేటికి 2213 రోజులు పూర్తి చేసుకుంది. ఎంతోమంది అభాగ్యులు, నిరస్రాయులకు సిద్ధార్థ అనాధ ఆశ్రమంలో అన్నదానం చేస్తూ ఆకలి కడుపులు నింపుతున్నారు. దాతల సహకారంతో అందరి దీవెనల వల్ల ఈ అన్నదానం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.