పత్తి వ్యాపారుల తిత్తి తీసిన రైతులు

పత్తి వ్యాపారుల తిత్తి తీసిన రైతులు
భద్రాచలం 9ఎక్స్ప్రెస్ న్యూస్ : భద్రాచలం ఏజెన్సీ ప్రాంతమైన చర్ల మండలంలోని గ్రామాలలో ఆటోల ద్వారా తిరుగుతూ సిసిఐ కన్నా ఎక్కువ రేటు పెడుతామని చెప్పి పత్తిని కొనుగోలు చేస్తూ తూకంలో మోసం చేస్తున్న విషయాన్ని గమనించి ఆరుగురు వ్యాపారులకు దేహశుద్ధి చేశారు సింగసముద్రం గ్రామస్థులు. ఎండనక వాననక కష్టాన్నే నమ్ముకుని ఆరుగాలం కష్టపడి పండించిన పత్తి పంటను యాభై కేజీల పత్తి బస్తాను తూకంలో మోసం చేస్తూ ముప్పై కేజీలకే లెక్క కట్టడంతో మోసాన్ని గమనించిన గ్రామస్థులు కట్టలు తెంచుకునే ఆగ్రహంతో పత్తి వ్యాపారస్తులకు చింత బరిగెలతో బడితే పూజ చేశారు. ఎక్కువ రేటు పెడుతామని పత్తి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారస్తుల తూకం మోసం పట్ల ఏజెన్సీ ప్రాంత రైతులు అప్రమత్తంగా ఉండాలని సింగసముద్రం గ్రామస్థులు కోరారు.